Allu Sirish New Movie Buddy OTT Update: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన లేటేస్ట్ మూవీ ‘బడ్డీ’. ఈ మూవీకి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇందులో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ ఓటీటీ అప్డేట్ ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫిక్స్లో ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో అజ్మల్, ప్రిషా రాజేశ్ సింగ్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్పై కేఈ రాజా, అధన రాజా నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ మూవీకి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్గా చేశారు.
Also Read: ఒకే వేదికలో చిరు, బాలయ్య కలిసారిలా
సినిమా కథ విషయానికొస్తే.. ఆదిత్య(అల్లు శిరీష్) జాబ్లో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతుంటాయి. ఈ తరుణంలో అక్కడ పల్లవి (హీరోయిన్ గాయత్రి) పరిచయమవుతోంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అనుకోకుండా హీరోయిన్ చేసే చిన్న పొరపాటు ఆదిత్య ఉద్యోగం కోల్పోతాడు.
ఎలాగైనా క్షమాపణలు చెప్పాలని అనుకొని వస్తుండగా.. కిడ్నాప్నకు గురవుతోంది. ఈ సమయంలో జరిగిన గొడవలో ఆమె కోమాలోకి వెళ్తుంది. తర్వాత ఆమె ఆత్మ టెడ్డీ బేర్లోకి వెళ్తోంది. తర్వాత జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అనేది ఆసక్తికరంగా ఉండనుంది.
Edhuru thirigina simhani, puli ni, chiruthani choosuntaru, anyayam pai thiragabadda oka teddy bear ni choosara? Ippudu choostharu.#Buddy is coming to Netflix on 30 August in Telugu, Tamil, Malayalam and Kannada!#BuddyOnNetflix pic.twitter.com/3eaV05kgne
— Netflix India South (@Netflix_INSouth) August 25, 2024