Helicopter Crash: హెలికాప్టర్ కూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పుణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే, వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఓ ప్రవైట్ ఏవియేషన్ కు సంబంధించినదని సమాచారం.
Also Read: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’
అయితే, పలు ఇతర కథనాల్లో మాత్రం.. హెలికాప్టర్ పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ లో ఉన్న మిగతా వారికి గాయాలయ్యాయని, వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.