Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ అంటే… భారత రాబడి పార్టీ అని వ్యాఖ్యానించిన సురేఖ…కేసీఆర్ సీఎం అయిన తరువాత… మేధావులు కూడా మాట్లడటం మానేశారన్నారు. మేధావుల సూచనతో కేసీఆర్ కు సంబంధం లేదని…. ఆయన అనుకున్నది చేస్తాడని వ్యాఖ్యానించారు.
జాగృతి పేరుతో కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని… అధికారం వచ్చాక… జాగృతిని… కవిత పట్టించుకోలేదని…ఇప్పుడు సీబీఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తెస్తున్నారని ఎద్దేవా చేశారు.జాగృతిని అడ్డుపెట్టుకుని… సీబీఐ నుండి తప్పించుకోవాలని కవిత చూస్తున్నారని కొండా సురేఖ అన్నారు.