EPAPER

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..

Malaysia: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో దారుణం జరిగింది. ఫుట్‌పాత్‌పై ఫ్యామిలీ సభ్యులతో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ఘటనలో ఏపీలోని కుప్పం ప్రాంతానికి చెందిన మహిళ అందులోపడిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు అధికారులు.


కుప్పంలోని అనిమిగాని‌పల్లెకు చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మి ఫ్యామిలీ మలేషియాలో ఉంటుంది. చిన్నిచిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన భర్త, కొడుకుతో కలిసి కౌలాలంపూర్‌లో పుట్‌పాత్‌పై నడుస్తోంది. కుటుంబ సభ్యులతో కష్టాలు చెబుతూ అడుగులు వేస్తోంది.

వారు వెళ్తున్న మార్గంలో పుట్‌పాత్ లోని కొంత భాగం కుంగిపోయింది. ఆమె డ్రైనేజీలో పడిపోయింది. ఆమె భర్త, కొడుకు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మహిళ ఆచూకీ లభించలేదు.


ALSO READ:  తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం చంద్రబాబు మలేషియా అధికారులతో మాట్లాడారు. విజయలక్ష్మి ఆచూకీ తెలపాలని సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

 

 

Related News

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

Big Stories

×