Badlapur Sexual assult: శివసేన(యూబీటీ) ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు వ్యతిరేకంగా నిరనసలు చేపడుతున్నవారిపై కేసులు పెట్డడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులపై ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా రాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చర్యలు చేపట్టకపోతే తాము రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొమంటూ హెచ్చరించారు.
Also Read: లిక్కర్ కేసు.. కేజ్రీవాల్కు నిరాశే.. సెప్టెంబర్ ఐదున విచారణ
అదేవిధంగా.. విపక్ష కూటమి మహా వికాస్ అఘాడి శనివారం చేపట్టనున్న ‘మహారాష్ట్ర బంద్’ రాజకీయాల కోసం చేస్తున్నది కాదుని.. కొందరు కీచకుల వక్రబుద్ధికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామన్నారు. వ్యవస్థలు తమ పనులను సరిగా నిర్వర్తించాలని, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చాటిచెప్పేందుకే బంద్ చేపడుతున్నామన్నారు. ప్రజలు భారీగా ఈ బంద్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ ను ఖచ్చితంగా పాటించాలన్నారు. అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.