IBPS Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లతో పాటు మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 4455
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఆగస్టు 1, 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు: జనరల్ , ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం : ప్రిలిమినరీ ,మెయిన్స్ పరీక్షలు, ఇంటర్యూ, ధ్రువపత్రాల పరిశీలన , మెడికల్ ఇగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 1, 2024
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 28,2024