MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. మహిళలను కించపర్చడం బీజేపీకి కొత్తేం కాదని అన్నారు. సరైన సమయంలో బీజేపీకి బుద్ధిచెబుతామన్నారు. మమతా బెనర్జీని మోదీ ఎలా అవమానించారో..అలాగే బండి సంజయ్ తనను అవమానపరిచారన్నారు కవిత.
రాబోయే దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రముఖ స్థానాన్ని పోషిస్తుందన్నారు. పని చేయడం తమకు కొత్త కాదన్నారు. బండి సంజయ్ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. గత 12 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ కష్టపడి బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ బొమ్మను వచ్చేలా చేశామన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని అన్నారు.
దేశంలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందని కవిత అన్నారు. జాగృతి కూడా ఇక పై తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. భారత జాగృతి ఇప్పటికే రిజిస్టరయి ఉందన్నారు. భారత జాగృతి ద్వారా..ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ కల్చర్ను గౌరవించే కార్యక్రమాలు చేపడతామన్నారు. పసుపు బోర్డు రాకపోవడానికి కారణం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అని అన్నారు కవిత.