Indian bus fall at river in Nepal: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో పలువురు గల్లంతు అయినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. ఘటన సమయంలో నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ ఘటన తనహున్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన బస్సు.. పోఖరా నుంచి ఖాట్మండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక సైడ్ అంతా కొండ.. మరోవైపు నది ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదం దాటికి బస్సు పైటాప్ ఎగిరి నదిలో పడింది.
ALSO READ: థాయిలాండ్ లో కుప్పకూలిన విమానం..9 మంది మృతి
యూపీ ఎఫ్టీ 7623 నెంబరు గల బస్సు అని నేపాల్లోని తనహ్యూ జిల్లా పోలీసు అధికారి తెలిపారు. బస్సు ప్రమాదం విషయం తెలియగానే యూపీ రిలీఫ్ కమిషనర్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన బస్సులో యూపీకి చెందినవారు ఎవరైనా ఉన్నారా అనేదానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
నేపాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. భారీ వర్షాలు కొండచరియల కారణంగా రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మంది ప్రయాణికులు గల్లంతైన విషయం తెల్సిందే.
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.
నదిలో పడిపోయిన బస్సు.
బస్సులో 40 మంది భారతీయులు.
పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఘటన.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.#NepalBusAccident #Nepal #RoadSafety #NewsUpdates #Bigtv pic.twitter.com/2nb5aX7MqZ
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2024