Test series between India and England under the captaincy of Rohit:
భారత్ ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐతో పాటుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించాయి. 2025 జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనున్నట్టు ఇరు జట్లు వెల్లడించాయి. మరీ ఈ షెడ్యూల్ వివరాలు ఎలా ఉన్నాయో మనం కూడా ఓ లుక్కెద్దాం..
ఫస్ట్ టెస్ట్ వచ్చే ఏడాది జూన్ నెల 20 నుంచి 24 లీడ్స్ వరకు, రెండో టెస్ట్ జూలై నెల 2 2025 నుంచి 6 బర్మింగ్ హామ్ వరకు, మూడో జూలై నెల 10 2025 నుంచి 14 వరకు లండన్లో జరగనున్నాయి. ఇక నాలుగో టెస్ట్ జులై నెల 23 నుంచి 27 వరకు మాంచెస్టర్ వేదికగా..ఇక ఐదవ టెస్ట్ జూలై నెల 31 నుంచి ఆగస్ట్ నెల 4 వరకు లండన్లో జరుగనున్నాయి.
Also Read: యూట్యూబ్తో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ రికార్డ్
అయితే ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా మూడేళ్ల క్రితం ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. అయితే దాన్ని 2*2తో సమంగా ఇరు జట్లు పంచుకుంటాయి. మరో టెస్టు అయితే డ్రాగా ముగిసినట్టు తెలుస్తోంది. ఇక రానున్న సిరీస్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నాలుగో పార్ట్ ప్రారంభించనుంది. ఇక ఈ సిరీస్కు కూడా టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ మరోసారి బాధ్యతల పగ్గాలను తన చేతిలోకి తీసుకోనున్నారు. మరోవైపు 2025 జూన్ జులై మధ్యనే భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ వేదికగా మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనున్నట్టు తెలిపింది.