Actor Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని.. సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించగా.. ఎస్ జె సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పాన్ ఇండియా లెవెల్లో సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాని అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. అన్ని స్టేట్స్ లో ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. అయితే బాలీవుడ్ మాత్రం నానిపై గుర్రుగా ఉంది. అందుకు కారణం ప్రభాస్ వివాదం. బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షి.. ప్రభాస్ ను జోకర్ అన్న విషయం తెల్సిందే. దానికి టాలీవుడ్ మొత్తం మండిపడుతుంది.
ఇక ఈ వివాదంలో నాని కూడా ఇరుక్కున్నాడు. ఈ మధ్యనే ఈ వివాదంపై నాని స్పందిస్తూ.. అతనికి ఎక్కువ హైప్ ఇస్తున్నారని, అతని లైఫ్ లోనే ఇంత పబ్లిసిటీ ఎప్పుడు వచ్చింది లేదని, అనవసరమైనవి హైలైట్ చేయకుండా ఉంటే బావుంటుంది అని ఎద్దేవా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడు ఆ వివాదమే.. నానిని ట్రోల్స్ బాట పట్టేలా చేస్తుంది. ఎప్పుడు నాని జోలికి రాని నార్త్ ఫ్యాన్స్ .. అతనిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హద్దుమీరి బూతులు మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు. నేడు ముంబై వెళ్లిన నానికి కచ్చితంగా దీనిపై ప్రశ్న ఎదురవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ వివాదం వలన నాని సినిమా.. బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.