APPSC Group-1 Exams Postponed 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.
అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ వినతులను పరిగణనలోకి తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశామన్నారు. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించారు.