Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 6వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు.
Also Read: అంబులెన్స్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది
జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఇందుకు సంబంధించి ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.