Perni Nani comments on Chandrababu(AP latest news): ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. జగన్ సీఎంగా చేసిన మంచి పనులను కూటమి ప్రభుత్వం చూసి ఓర్వ లేకపోతుందని ఆరోపించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కూటమి రూ. 3.63 కోట్లతో ఎగ్ పఫ్ తిన్నారని తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలని అన్నారు.
బొద్ధింకలు , ఎలుకలకు బాబు కోట్లు చెల్లించాలని అన్నారు. పాలించే సత్తాలేక జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారంపై కాదు.. హామీలపై కూడా దృష్టి పెట్టండని హితవు పలికారు. జీఏడీ చంద్రబాబు చేతిలోనే ఉంది. గత హయాంలో ఎలాంటి తప్పులూ చేయలేదు. చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దికలు, ఎలుకలను పట్టకునేందుకు కోట్లు ఖర్చు చేశారు. ఈ ఘనత మాత్రం కేవలం చంద్రబాబుకే దక్కుతుంది. టమాటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ రైతులు బాధ పడుతుంటే.. లోకేష్ ఏం చేస్తున్నారని నాని నిలదీశారు.
Also Read: జగన్కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..
ఎంగిలి బిస్కెట్లకి ఆశపడి @ysjagan గారిపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతున్న పచ్చమంద
సిగ్గులేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారే.. ఇది జర్నలిజమా.. బ్రోకరిజమా?
దమ్ము, ధైర్యముంటే సాక్ష్యాలతో నిరూపించండి. లేదా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. pic.twitter.com/RYSchbcDBn
— YSR Congress Party (@YSRCParty) August 21, 2024