శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి కారణంగా కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు ఘాట్రోడ్డులో అడ్డంగా పడ్డాయి. రహదారిపై బండరాళ్లు పడటంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు కొండ చరియలు విరిగిపడే సమయంలో వాహనాలు ఏవి లేకపావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రహదారిపై రాళ్లను తొందరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలను భక్తులు అధికారులు విజ్ఞప్తిచేశారు.
మరో వైపు తెలంగాణాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు భారీ వర్షం.. ఇది ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోత కొనసాగుతుండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడుతున్నాడు. తెల్లవారుజామున ప్రారంభమై.. ఉదయం వరకు కుండపోత వాన కురుస్తోంది. దానికి తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురస్తుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. నిన్న పంజాగుట్టలో అపార్ట్మెంట్పై పిడుగు పడింది. రాత్రి కురిసిన వర్షానికి ఇంకా కొన్ని కాలనీలు జలవలయంలోనే చిక్కుకున్నాయి. రోడ్లపైనే వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా.. వరుణుడు ఉదయం పూట కాస్త బ్రేక్ ఇచ్చినా.. ఎప్పుడు విరుచుకుపడతాడో అన్న టెన్షన్ ఉంది. అప్పటికప్పుడు ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతోంది.
Also Read: జగన్కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..
ఇక.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక రేపు, ఎల్లుండు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.