అంటే ఉదాహరణకి.. ఒక సీజన్ లో ఒక ఫ్రాంచైజీకి సుమరు రూ.100 కోట్లపైనే ఖర్చవుతుందని క్రికెట్ నిపుణుల అంచనా.. మరి అంత లాభం వారికెలా వస్తుందనే సందేహాలు అందరిలో ఉంటాయి. అయితే ఇదంతా బీసీసీఐకి వచ్చే లాభాలను బట్టే ఉంటాయని చెబుతున్నారు.
ఉదాహరణకి 2024 సీజన్ లో ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి రూ.12 వేల కోట్లు లాభం వస్తే.. అందులో వారికి దాదాపు అన్నింట్లో గీచిగీచి బేరాలు చేసి 20 నుంచి 30 శాతం ముట్టచెబుతుందని అంటున్నారు. ఇప్పుడు బీసీసీఐకి 2024లో వచ్చిన రూ.12 వేల కోట్లలో నిర్వహణ ఖర్చులు, ప్రైజ్ మనీ, ఇతర ఖర్చులు పోను రూ.8 వేల కోట్లు మిగిలిందని అనుకుందాం.
అందులో 30 శాతం అంటే దాదాపు రూ.2400 కోట్లు ఫ్రాంచైజీలకు ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్ లో 10 ఫ్రాంచైజీలు ఆడుతున్నాయి కాబట్టి.. ఇలా చూస్తే ఒకొక్క జట్టుకి దాదాపు రూ.240 కోట్లు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఫ్రాంచైజీ రూ.100 కోట్లు ఖర్చు పెడితే , వారికి లాభం రూ.140 కోట్లు ఉంటుంది. అయితే ఆయా ఫ్రాంచైజీలు వాళ్ల ఖర్చులు, వాటి నియంత్రణ బట్టి లాభాలుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.
అయితే, ఇదంతా కూడా బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. అది తగ్గితే వీరికి షేరింగ్ తగ్గిపోతుంది. ఇక ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ప్రైజ్ మనీ రూ.40 కోట్లు వస్తుంది, రన్నరప్ కి రూ.20 కోట్లు వస్తుంది. ఇవన్నీ ఫ్రాంచైజీలకు అదనపు ఆదాయాలను ఇస్తాయి.
అయితే ఫ్రాంచైజీలకు ఇవే కాకుండా సొంతంగా కూడా బ్రాండ్ వాల్యూ మీద కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఫ్రాంచైజీ కూడా…ఆ బ్రాండ్ కోసం పోరాడుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీలకు మాత్రమే బ్రాండ్ వాల్యూ ఉంది.