Naresh Pavitra Lokesh:సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్ ఇటీవల కొందరు తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని, తప్పుడు వార్తలను ప్రచారం చేశారని చెబుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వీరు నాంపల్లి కోర్టుని కూడా ఆశ్రయించారు. అందులో భాగంగా కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్, వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. కేసుని పరిశీలించిన నాంపల్లి కోర్టు నరేష్ ఫిర్యాదు చేసిన 12 యూ ట్యూబ్ ఛానెల్స్కు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సైబర్ పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది.
నరేష్ ఈ ఫిర్యాదులో తన మూడవ భార్య రమ్యా రఘుపతి డబ్బులిచ్చి తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేయిస్తుందని పేర్కొన్నారు. నటుడు వీకే నరేష్, అతని మూడో భార్య రమ్యా రఘుపతి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇప్పుడు నరేష్, సహ నటి పవిత్రా లోకేష్తో కలిసి ఉంటున్నారు ఈ విషయంలోనే రమ్యా రఘుపతి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కొన్నాళ్లు ముందు వీరి గొడవ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. తర్వాత వ్యవహారం సైలెంట్గా మారింది.