బుధవారం మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకోనున్నారు. జమ్మూ, శ్రీనగర్లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో కూడా ఖర్గే, రాహుల్ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎలక్షన్ లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో వారిరువురు చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో పాటు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ శ్రీనగర్ భేటీ అవ్వనున్నారు. ఈ ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతరపార్టీలతో జతకట్టే అవకాశం ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు నాలుగు రాష్ట్రాలు.. హరియాణ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: నేడు భారత్ బంద్.. వాహనాలు రోడ్లపై రాకుండా అడ్డగింత!
ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జ్లు, స్ర్కీనింగ్ కమిటీ సభ్యులతో సోమవారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశమై చర్చించారు. ఇక జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ 3 విడతల్లో జరగనుంది. అందులోభాగంగా తొలి విడత నోటిఫికేషన్ మంగళవారం ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4న వెలువడనున్నాయి.