Congress Leader : ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత అరెస్ట్ అయ్యారు. ఆ రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాజా పటేరియా.. మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో దామోహ్ జిల్లా హట్టాలోని పటేరియా ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి చేశారు. అంతకుముందు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశాలతో పన్నా జిల్లాలోని పవయీ పోలీస్ స్టేషన్లో పటేరియాపై కేసు నమోదైంది.
వివాద నేపథ్యం
రాజ్యాంగాన్ని, మైనార్టీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ సిద్ధం కావాలి. ‘చంపడం’ అంటే ఆయనను ఓడించడమని అర్థం అని పటేరియా మాట్లాడి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పవయీ ప్రాంతంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీని ఉద్దేశించి రాజా పటేరియా చేసిన కామెంట్స్ మధ్యప్రదేశ్ లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులూ పటేరియా మాటలను ఖండించారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని పటేరియా వివరణ ఇచ్చుకున్నారు. అయినా సరే వివాదం సద్ధమణగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా రంగలోకి దిగారు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిచారు. దీంతో కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు.