Italy : ఇటలీ రాజధాని రోమ్లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రోమ్లోని ఫిడెన్ జిల్లాలోని ఓ కేఫ్లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్ రెసిడెంట్స్ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్లో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఓ దుండగుడు తుపాకీతో అక్కడికి చేరుకుని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇటవీ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
ఈ కాల్పుల్లో చనిపోయిన ముగ్గురూ మహిళలే. కాల్పుల తర్వాత స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 50 ఏళ్ల నికొలెట్టా గొలిసానో తన స్నేహితురాలేనని ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ఆమెతో గతంలో దిగిన సెల్ఫీని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన మెలోనీ దేశ తొలి మహిళా ప్రధాని. మెలోని అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
పాశ్చాత్య దేశాల్లో రోజురోజుకు గన్ కల్చర్ మితిమీరుతోంది. అమెరికాలో గతంలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు ఇటలీలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.