HYDRA: హైదరాబాద్ లో హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. తాజాగా హైడ్రా దృష్టి మణికొండపై పడింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలపై కొరడా విసిరారు.
జీఓ నంబర్ 658 ప్రకారం రో హౌజ్ నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ.. చిత్రపురి పాలకవర్గం దొంగచాటుగా నిర్మాణాలకు అనుమతులు పొందింది. G+1 నిర్మాణాలకు అనుమతులు తీసుకుని.. G+2 నిర్మాణాలను చేపట్టింది. ఈ విషయాన్ని గమనించిన హైడ్రా.. ఆ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది.
Also Read: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. మళ్లీ క్లౌడ్ బరస్ట్ ?
సినీ కార్మికులు అందరికీ న్యాయం జరగాలంటే రో హౌజ్ లను పూర్తిగా నేలమట్టం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు రూ.50 కోట్లు మేర నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ప్రదేశంలో 3 వేల మంది సినీ కార్మికులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. చిత్రపురి కాలనీలో ఈ 7 విల్లాలే కాదని, మిగతా అవకతవకలపై కూడా గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.