Tollywood Actress Sai Pallavi Remuneration(Cinema news in telugu): ఇప్పుడున్న కాలంలో ఒక హీరో రూ.50 కోట్లు తీసుకోవడమనేది సాధారణంగా మారిపోయింది. కానీ ఒక హీరోయిన్ రూ.50 కోట్లు తీసుకుంటుందనేది విషయం మీకు తెలుసా? ఆమె బాలీవుడ్ హీరోయిన్ కాదు.. మన తెలుగు హీరోయిన్ సాయిపల్లవి. మనలోకళ ఉండాలే కానీ కళకళలాడే ఓ రోజు తప్పకుండా వస్తుంది. ఈ సత్యాన్నినమ్ముకొని నవతరం నాయిక చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే నాట్యం. సంగీత దర్శకుల బాణీలకు అణువుగా తన కాళ్లతోను, చేతులతోను నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయిపల్లవి సొంతం.
నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రలోకి అతి సులువుగా ఒదిగిపోతు కనిపిస్తుంది. తన అందం అభినయంతో ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది. తీసింది కొన్ని సినిమాలే అయిన గ్లామర్ కు అతీతంగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ లకు సైతం సూపర్ క్రేజీ సంపాదించుకుంది. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, వంటి పలు సినిమాల్లో నటించి తన నటనతో. డాన్స్ తో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
ఇక తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆమె తరువాత నటించబోతున్న రామాయణం సినిమా కోసం అక్షరాల రూ.50 కోట్లు తీసుకుంటున్నారట. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు నితీష్ తెరకెక్కిస్తున్నారు. రాముడిపాత్రలో రణబీర్ కపూర్, సీతమ్మ వారి పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా దాదాపు రెండేళ్లపాటు షూటింగ్ జరగబోతుంది. అందుకే ఆమె ఇంతమొత్తంలో పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: స్త్రీ 2 సాంగ్ కోసం తమన్నా అంత రెమ్యునరేషన్ తీసుకుందా ?
రామాయణం మూవీని మూడు పార్ట్ లుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో సాయపల్లవి నుంచి బల్క్ డేట్స్ కావాలి. ఈ సినిమా ఎంత లేదన్న దాదాపు రెండేళ్లవరకు పడుతుంది కాబట్టి మరే సినిమా చేయడానికి వీలుండదు. పైగా సీతాదేవి కారెక్టర్ లో నటిస్తోంది కాబట్టి అదే ట్రాన్సలో ఉండాలని సాయపల్లవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట.