Fake tickets in Tirumala(AP news today telugu): తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. తిరుమలలో నకిలీ రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను అమ్ముతున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. కలర్ జిరాక్స్ టికెట్లతో వెళ్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే దగ్గర రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో నకిలీ టికెట్లతో పలువురు భక్తులు దర్శనం క్యూలోకి వెళ్లారు. విజిలెన్స్ అధికారులు వారిని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: కోటవురట్ల ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత.. బయటి నుంచి ఎవరో..
ఓ పాత నేరస్థుడు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసి 4 టికెట్లకు గానూ రూ. పదకొండు వేలు వసూలు చేశాడంటా. ఆ మొత్తాన్ని రుద్రసాగర్ తో కలిసి పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నకిలీ టికెట్ల వ్యవహారంలో పలువురు ఏపీ టూరిజం, టీటీడీ కార్పొరేషన్ అధికారుల హస్తున్నట్లు తెలుస్తోందంటూ అందులో పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.