Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్ నేపథ్యంలో పలు షరతులను విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 గా అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనారోగ్యం కారణంగా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇటు పిటిషనర్, అటు అధికారుల నుంచి వాదనలు విన్న నాంపల్లి కోర్టు , 15రోజులపాటు మధ్యంతర బెయిలిచ్చింది. బెయిల్ సమయంలో పలు షరతులను విధించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి23న భుజంగరావుని అరెస్ట్ చేశారు పోలీసులు.
ALSO READ: సీఎం రేవంత్ ప్రతిపాదన, ఇవాళ సింఘ్వి నామినేషన్
ఈ కేసులో కీలక నిందితుడు ఏ 1 ప్రభాకర్రావు బయటపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏ6 శ్రవణ్కుమార్ పరారీలో ఉన్నారు. ఆయన దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణాలతో తాను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, కోలుకున్న తర్వాత వస్తానని ప్రభాకర్రావు న్యాయస్థానానికి తెలిపారు.
వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. కేసు మొదలై చాన్నాళ్లు గడుస్తున్నా కీలక నిందితులను హాజరుపరచకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ఇంటర్ పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.