EPAPER

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..

Texas accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి అరవింద్ మణి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు అక్కడ లేడు.


టెక్సాస్‌లోని లాంపాసాప్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్నారై ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు స్పాట్‌లో మృతి చెందారు. వారిలో అరవింద్ మణి (45), ప్రదీపా అరవింద్ (40), ఆండ్రిల్ అరవింద్ (17) ఉన్నారు. అయితే వీరికి 14 ఏళ్ల కొడుకు ఆదిరియన్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు వాహనంలో లేడు.

అరవింద్ మణి ప్రయాణిస్తున్న కారును, ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఆ కారు వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని టెక్సాస్ డిపార్టెమెంట్ ఆప్ ఫబ్లిక్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కార్లకు సంబంధించి మొత్తం ఐదుగురు మృతి చెందగా, అందులో మణి కుటుంబసభ్యులు ముగ్గురు ఉన్నారు.


ALSO READ: అమెరికాలోనూ..వేణుస్వామి వారసురాలు? ఎవరు గెలుస్తారో చెప్పేసింది

అతి వేగమే ఈ ఘటనకు కారణమైందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నమాట. గడిచిన 26 ఏళ్లలో ఆ తరహా ప్రమాదం జరగలేదని అంటున్నారు. అరవింద్ మణి కూతురు ఆండ్రిల్‌ రీసెంట్‌గా హైస్కూల్ పూర్తి చేసింది. డల్లాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని భావిస్తోంది. ఇంతలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. అరవింద్ మణి కొడుకు ఆదిరియన్ తొమ్మిది చదువుతున్నాడు. ప్రమాదంలో కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు.

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×