Delhi teen dies: విధి రాతను ఎవరూ మార్చలేరు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏం జరగాలో అదే జరిగింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. పైనుంచి ఏసీ పడి 18 ఏళ్ల యువకుడు స్పాట్లో మృతి చెందాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఢిల్లీ.. కరోల్బాగ్ ఏరియా.. నిత్యం వ్యాపారాలతో ఆ ప్రాంతం బిజిబిజీగా ఉంటుంది. సమయం సాయంత్రం ఏడుగంటలు అవుతోంది. 18 ఏళ్ల జితేష్చంద్ర అపార్టుమెంటు బయట స్కూటర్పై కూర్చొని ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. అతడు ఏం మాట్లాడుతున్నాడనేది కాసేపు పక్కనపెడదాం. సమస్యలు చెబుతూ బిజీగా ఉన్నాడు. ఈలోగా మూడో అంతస్థు నుంచి ఒక్కసారిగా ఏసీ యూనిట్ ఆ యువకుడిపై పడింది.
ఇంకేముంది స్పాట్లో మృతిచెందాడు ఆ యువకుడు. పక్కనేవున్న మరో ఫ్రెండ్కి గాయాలు అయ్యాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు పక్కనేవున్న సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ విషాదకర ఘటనను వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఫుటేజ్ సోషల్మీడియాలో వైరల్ అయ్యింది.
ALSO READ: క్షమాపణలు కోరిన మహిళా ఎంపీ.. కావాలని అలా చేయలేదంటూ..
ఈ ఘటనను కళ్లతో చూసినవారు మాత్రం విధిరాతను ఎవరూ తప్పించలేరని అంటున్నారు. ఈ తరహా ఘటనలు చాలా జరిగియా, సీసీకెమెరాలో ఆయా దృశ్యాలు బయటకువచ్చాయి. అక్కడితో ఆ యువకుడికి నిండు నూరేళ్లు నిండాయని అంటున్నారు. మరోవైపు ఏసీ.. ఏ ఫ్లోర్ నుంచి ఏసీ పడిందో చుట్టుపక్కన వారు గుర్తించారు. ఆ ఘటనను చూసి ఆ ఫ్లాట్ ఓనర్ కూడా షాకయ్యాడు.
స్నేహితుడితో మాట్లాడుతుండగా ఏసీ యూనిట్ మీద పడటంతో 17 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి.. ఢిల్లీలోని కరోల్ బాగ్లో ఘటన.#ViralVideo #Delhi #Accident #CCTV #NewsUpdates #Bigtv pic.twitter.com/66PHp08n3r
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2024