కానీ మనదేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజులో కొన్ని గంటలపాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ విశిష్టత కలిగిన దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లోని బన్షీ నారాయణ ఆలయం హిమాలయాల్లో ఉంటుంది. ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి. అదికూడా రక్షాబంధన్ రోజునే తెరుస్తారు. ఆ రోజు ఇక్కడ పూజలు జరిపితే విశేషమైన పుణ్యం లభిస్తుందట. అలాగే మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే తీరిపోతుందట.
Also Read: రాఖీ పూర్ణిమ వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..
రక్షాబంధన్ రోజున ఇక్కడికి వచ్చే మహిళలు బన్షీ నారాయునుడికి రాఖీ కడతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగష్టు 19 వ తేదీనా సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 11:55 నిముషాలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ ఆలయంలో దర్శనానికి అవకాశం ఉంటుంది.