GST Raids : గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీకి ఐటీ దాడులు సెగ తగిలింది.
తెలుగులో అగ్రకథనాయకులతో భారీ చిత్రాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాతలు యలమంచలి రవి శంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపులు, తదితర అంశాలపై వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది. 4 నాలుగు భారీ ప్రాజెక్టులకు 700 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. పుష్ప -2 కోసం భారీగా ఖర్చు చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రాలు
శ్రీమంతుడు
జనతా గ్యారేజ్
రంగస్థలం
సర్కారు వారి పాట
పుష్ప ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రాలు
వాల్తేరు వీరయ్య
వీరసింహారెడ్డి
పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్