EPAPER

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యూపీలోని కాన్పూర్ వద్ద శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.35 నిమిషాలకు ట్రైన్ పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఓ వస్తువును రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు ఈ రైలు వెళ్తోంది. శనివారం తెల్లవారుజామున 02:35 గంటలకు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఇంజిన్ ఢీకొట్టి పట్టాలు తప్పింది.

రైల్వే ట్రాక్‌లో ఎలాంటి పగుళ్లు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఐబీ, యూపీ పోలీసులు సంయుక్తం గా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు ఆ రూట్లో వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.


ALSO READ: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

ఏడాదిగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల వెనుక కారణమెవరు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రైళ్ల ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు.

 

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×