Central Govt on Airports & metro projects(Telugu news live): పాట్నా, బెంగళూరు, థానే, పూణె నగరాలకు కేంద్రం వరాల జల్లును ప్రకటించింది. దాని ప్రకారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా లో కొత్తగా సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. నూతన సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చు ఒక వెయ్యి నాలుగువందల పదమూడు కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే సివిల్ ఎన్ క్లేవ్ నిర్మాణంతో పాట్నా ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల రద్దీని గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు.అయితే దీని నిర్మాణం అరవై ఆరు చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరగనుంది. ఒకేసారి మూడు వేల మంది ప్రయాణికులు ఈ ఎన్ క్లేవ్ ఉపయోగపడుతుంది. దీనితో పాట్నా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఈ వార్త తెలిసి పాట్నాలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ కష్టాలు గట్టెక్కనున్నాయని..కేంద్రానికి కృతజ్ణతలు తెలుపుకుంటున్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు
బెంగళూరు మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా మోక్షం లభించింది. రెండు ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటుకానున్నాయి. దీని ప్రకారం మొత్తం 31 మెట్రో స్టేషన్లు నిర్మాణం జరగనున్నాయి. అలాగే మహారాష్ట్ర లోని థానే, పూణె నగరాలకు సైతం పలు మెట్రో ప్రాజెక్టులు మంజూరయ్యాయి.