Avatar 2: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’. 13 ఏళ్ల ముందు అంటే 2009లో ఈయన తెరకెక్కించిన అవతార్ సినిమాకు సీక్వెల్ ఇది. అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. అందులో విజువల్స్ సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాయనటంలో సందేహం లేదు. 165కి పైగా దేశాల్లో అవతార్ 2ను డిసెంబర్ 16న రిలీజ్ చేస్తున్నారు.
3D, 4DX టెక్నాలజీతో రూపొందిన అవతార్ 2 సినిమాను ప్రేక్షకులను అలరించనుంది. 4DX టెక్నాలజీలో సినిమాను చూడాలంటే రూ.1400 రేటుతో టికెట్ను కొనాలి. అలాగే 3D టెక్నాలజీలో సినిమాను చూడాలంటే రూ.1050లతో టికెట్ను కొనుగోలు చేయాలి. ఇప్పటి వరకు అవతార్ 5 లక్షలు టికెట్స్ ప్రీ బుకింగ్స్లో బుక్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అది కూడా వారాంతంలోనే. అంటే రూ.16 కోట్లు గ్రాస్ వసూళ్లు వారాంతంలో వస్తాయి. మొత్తంగా ప్రీ సేల్ బుకింగ్స్లో రూ.45-80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావచ్చునని సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న టాక్.
అవతార్ చిత్రంలో పండోరా గ్రహంపై పోరాటాన్ని చిత్రీకరించిన జేమ్స్ కామెరూన్.. అవతార్ 2 సినిమా నీటిలో చేసే పోరాటంపై సినిమా ఉంటుంది. ప్రపంచం అంతా అవతార్ 2 కోసం ఎగ్జయిట్మెంట్తో ఎదురుచూస్తున్నారు.