CM Revanth Reddy About BRS Merging In BJP(Ts politics): బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారన్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగిన వెంటనే కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారని, బీఆర్ఎస్ విలీనంలో కవితకు రాజ్యసభ పదవి ఇస్తారన్నారు.
బీజేపీలో కేసీఆర్ బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని, అయితే విలీనం చేయడం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు అంటారే తప్పా ఎప్పుడూ చెప్పడం లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు అందరితోనూ నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వడం, ఇవ్వకపోవడం వారి ఇష్టమన్నారు. రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వకపోతే రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం రేవంత్ అన్నారు.