Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం బండి జిల్లా నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ… రాహుల్ ముందుకు సాగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణే లక్ష్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలు వింటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే సుపరిపాలన తెస్తామని స్పష్టం చేస్తున్నారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల్లో యాత్ర పూర్తైంది.