Rishabh Pant Entry Into The Delhi Premier League: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎడిషన్ కావడంతో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ బరిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అంతేకాకుండా శ్రీలంక టూర్ని ముగించుకొని స్వదేశానికి వచ్చిన అనంతరం పంత్ ప్రస్తుతం రెస్ట్ మూడ్లోకి వెళ్లాడు. డీపీఎల్లోని అన్ని మ్యాచ్లను పంత్ ఆడే ఛాన్స్ లేదు. అందులోనూ కొన్ని మ్యాచ్లు మాత్రమే మనోడు ఆడనున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఇక దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పంత్ బరిలోకి దిగనుండటంతో ఆటలో మజా రానుందని అందరూ భావిస్తున్నారు. గాయం అనంతరం రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే బరిలోకి దిగాడు. అతడు టీమ్లో చోటు దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో అతడు రాణించాల్సి ఉంది.
Also Read: ఒలింపిక్స్లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!
డీపీఎల్ టీ20 లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు రిషబ్ పంత్ ఓకే అన్నాడు. ఢిల్లీ యూత్కి ఇది నిజంగా గొప్ప వేదికనే చెప్పాలి. ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు పంత్ టీమ్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అందరికి ఎంతో ఆనందంగా ఉంది. అతడి కెరీర్ ముందుకు సాగడంతో ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ కీలక రోల్ పోశించనుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.