Weather Report: రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తాజాగా వెల్లడించింది. తెలంగాణలో గురువారం, శుక్రవారం, శనివారం.. మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగం, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడల్చ్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అదేవిధంగా ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది.
Also Read: సీఎం రేవంత్ కీలక ప్రకటన..త్వరలోనే రైతు భరోసా
ఇదిలా ఉంటే.. బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే.