Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం గతేడాది నవంబర్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. కొన్నేళ్లు ప్రేమించుకునేం ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లితో ఒక్కట్టయ్యారు. ఇక పెళ్లి తరువాత ఎవరి కెరీర్ లో వారు బిజీ అయ్యారు.
ఇక పెళ్లి అయిన ఇన్ని నెలలకు ఈ జంట శ్రీవారి సేవ చేసుకున్నారు. నేడు వరుణ్ – లావణ్య తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో వరుణ్ – లావణ్య స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక ఈ జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక వీరి కెరీర్ విషయానికొస్తే.. వరుణ్ ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ కూడా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అతని ఆశలు అన్ని మట్కా సినిమా మీదనే పెట్టుకున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక లావణ్య విషయానికొస్తే.. ఆమె ఒకపక్క వెబ్ సిరీస్ లు చేస్తూనే .. ఇంకోపక్క సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం.