Delhi BJP : ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఆదేశ్ గుప్తారాజీనామాను బీజేపీ అధిష్టానం అమోదించింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వీరేంద్ర సచ్ఛదేవ్కు తదుపరి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ జైత్ర యాత్రకు ఆప్ చెక్ పెట్టింది. డిల్లీ మేయర్ పీఠంపై 15ఏళ్లుగా కూర్చొన్న బీజేపీని గద్దె దించారు కేజ్రీవాల్. మొత్తం 250కి పైగా సీట్లకు గాను ఆప్ 134 స్థానాల్లో విజయం సాధిస్తే..బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆదేశ్ గుప్తా పదవి నుంచి తప్పుకున్నారు