Himachal Pradesh : హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖుకే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ హాజరైయ్యారు. సుఖ్విందర్ ఆహ్వానం మేరకు అసంతృప్త నాయకురాలు ప్రతిభా సింగ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయం అందరి కృషి వల్లే సాధ్యమైందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రానున్న ఐదేళ్లు హిమాచల్ ప్రజలకు సేవ చేసేందుకు ప్రణాళికలు రచించారమన్నారు.
స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు తాను అన్ని విధాల సహకరిస్తానని అసంతృప్త నేత ప్రతిభా సింగ్ అన్నారు. తన కుమారుడు, సిమ్లా రూరల్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్కు కేబినెట్లో చోటు దాదాపు ఖరారైనట్లేనని చెప్పారు.