Nizamabad : నిజామాబాద్ జిల్లా నవీపేటలో విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన పెళ్లికూతురు ఉరితాడుపై ప్రత్యక్షమైంది. పెళ్లికూతురు రవళి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రవళి ఆత్మహత్యకు పెళ్లి కుమారుడే కారణమంటూ మృతురాలి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ఉద్యోగం చేయాలంటూ రవళిని వేధించాడని ఫిర్యాదులో తెలిపారు. పెళ్లికూతురు ఆత్మహత్యతో కుటుంబంలో విషాయ ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.