CPI Narayana : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుంచి సీబీఐ తీసుకుంటున్న వివరణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీపీఐ నారాయణ విజ్ఞప్తి చేశారు. విచారణను లైవ్ ద్వారా ప్రసారం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆయన కోరారు. ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నారాయణ ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ప్రత్యక్ష విచారణలు చేస్తుందని.. సీబీఐ విచారణను ప్రత్యక్షప్రసారం చేయడంలో ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.