Vande Bharat Sleeper Coach Trains Features : వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. రాయ్ బరేలీ నుంచి మొదలై.. ఛందోసి, అలీఘర్, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సి, ఖాండ్వా, జల్గావ్, మన్మాడ్ మీదుగా ముంబైకు చేరుకుంటుంది. ఇందులో 823 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లలో యాంటీ – కొలిజన్ సిస్టమ్ కవాచ్ ను అమర్చారు. ఒక్కో కోచ్ తయారీకి రూ.10 కోట్లు ఖర్చైనట్లు సమాచారం.
వందేభారత్ స్లీపర్ రైలు ఫ్రంట్ ఫాసియా డిజైన్ తో ఉంటుంది.
ప్రయాణికులకు స్లీపర్ కోచ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతి బెర్త్ కు కుషనింగ్, ప్రతి బెర్త్ కు సులభంగా ఎక్కగలిగేలా డిజైన్ చేశారు.
ప్రస్తుతానికి BEML వద్ద నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ప్రోటో టైప్ ఇంటీరియర్ డిజైన్ గా కనిపిస్తోంది. చూడటానికి చాలా నీట్ గా, ప్రయాణికుడికి సౌకర్యవంతంగా డిజైన్ చేయబడింది.
ఈ రైళ్లలో ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, నాయిస్ ఇన్సులేషన్, నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వికలాంగుల కోసం ప్రత్యేక బెర్తులు, ఆటోమేటిక్ ఎక్స్ టీరియర్ ప్యాసింజర్ డోర్లు ఉన్నాయి.
రాజధాని రైళ్లలోని స్లీపర్ కోచ్ ను మించిన ఫీచర్స్ ను ఇందులో ఇస్తున్నారు. 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా.. ఎలాంటి శబ్దాలు వినిపించవు. ప్రయాణికులు కుదుపులకు కూడా గురికారు.
వందేభారత్ స్లీపర్ లో టాయిలెట్ ను ఎర్గోనామిక్ గా డిజైన్ చేశారు. ఎలాంటి చెడువాసన రాకుండా.. విమానాల్లో మాదిరిగానే మాడ్యులర్ ఫిట్టింగ్స్ తో బయో వాక్యూమ్ టాయిలెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. 1AC వాళ్లకి హాటర్ వాటర్ షవర్ సౌకర్యం కూడా ఉంటుంది.