Malaysia: కూటి కోసం కోటి తిప్పులు అన్నట్లుగా.. విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలు చాలా కష్టాలు అను భవిస్తున్నారు. అక్కడి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆ జాబితాలో రాంబాబు కూడా ఒకడు. మలేషియాకు వెళ్లిన అతడు.. అక్కడి కష్టాలను చెబుతూ తనను స్వదేశానికి రప్పించాలంటూ బిగ్ టీవీని ఆశ్రయించాడు.
విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పి, అక్కడికి వెళ్లిన తర్వాత మరో పనులు చేయిస్తున్నారు. అలాంటి జాబితాలో ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వచ్చారు. రీసెంట్గా గల్ప్ దేశాల్లో ఇద్దరు వ్యక్తులను తన కష్టాలను చెబుతూ ఏపీ ప్రభుత్వానికి చెప్పారు. దీంతో వారిని స్వదేశానికి రప్పించింది ఏపీ సర్కార్.
తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మలేసియాలో నరకయాతన అనుభవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం 2 లక్షల 50 వేలు అప్పు చేసి మలేసియాకు వచ్చాడు రాంబాబు. ఏకంగా 12 గంట లు వెట్టి చాకిరీ చేయించుకుని కేవలం పావుగంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారంటూ వాపోయాడు బాధితుడు.
ALSO READ: ఉమ్మడి తూ.గో జిల్లాలో వరుస హత్యలు.. కారణాలివేనా ?
తన పరిస్థితిని మంత్రి నారాలోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బిగ్ టీవీని ఆశ్రయించాడు రాంబాబు. తనకు కనీసం సెలవు ఇవ్వలేదని, ఇండియాకి వెళ్లాలంటే మనీ కట్టాలని ఒత్తిడి చేస్తున్నాడని తన బాధను వ్యక్తం చేశాడు. దయ చేసి తనకు సహాయం చేయాలని వేడుకున్నాడు.
కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి మలేసియాలో తీవ్ర ఇబ్బందులు…
బతుకు దెరువు కోసం రూ. 2 లక్షల 50 వేలు అప్పు చేసి మలేసియాకు వచ్చిన రాంబాబు.
అక్కడ 12 గంటలు వెట్టి చాకిరీ చేపించుకుంటూ 15 నిమిషాలు మాత్రమే రెస్ట్ ఇస్తున్నారు అంటూ వాపోయిన బాధితుడు రాంబాబు.
మంత్రి లోకేష్ దృష్టికి… pic.twitter.com/9WfU0vM3xf
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2024