Mamata Banerjee latest news(Telugu flash news): కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ను అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు కూడా సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: రాహుల్ ప్రమాదరకమైన వ్యక్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా
ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు ప్రారంభమైందని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఆదివారంలోగా పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తామని అన్నారు. ఆసుపత్రిలో నర్సులు, సెక్యురిటీ ఉండే క్రమంలో ఈ ఘటన ఎలా జరిగిందనేది అర్థం కావడం లేదని తెలిపారు. ఆర్జీ కార్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్ రాజీనామా చేశారని అన్నారు. ఈ ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.