Mastan sai arrested in Drugs Case(TS news updates): రాజ్ తరుణ్, లావణ్య కేసులో… తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లల్లో నానుతున్న మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తెలిపింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు చేశారు పోలీసులు. ఐతే అప్పట్లో పోలీసుల కళ్లుగప్పి మస్తాన్సాయి పరారయ్యాడు. దీంతో మస్తాన్ సాయి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ఓ దర్గాలో తల దాచుకోగా అరెస్ట్ చేశారు.
మస్తాన్ సాయి ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రయివేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: ప్రాణం తీసిన ఫోన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే…
ఇదిలా ఉంటే మస్తాన్ సాయి కేసుపై లావణ్య స్పందించింది. మస్తాన్ సాయి అరెస్ట్ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, వరలక్ష్మి టిఫెన్ సెంటర్ కేసులో తమ పేర్లు కావాలనే ఇరికించారని ఆరోపించింది. రాజ్ తరుణ్ కేసులో సెటిల్మెంట్ కోసం రూ. కోటి డిమాండ్ చేశారని పేర్కొంది. తాను కూడా మస్తాన్ సాయి బాధితురాలినేని వెల్లడించింది. తాను డ్రెస్ చేంజ్ చేసుకునే వీడియో మస్తాన్ సాయి ఫోన్లో ఉందని.. ఆ ఫోటోలతో తనను వారం రోజుల నుంచి మస్తాన్ బెదిరిస్తున్నాడని ఆరోపించింది.