Home Minister Anitha Comments on Jagan: మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత మరోసారి ఫైరయ్యారు. సెక్యూరిటీ విషయమై మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం జైలును పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ‘జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీని మేం తగ్గించలేదు. భద్రత తగ్గించారంటూ ఆయన కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలి.
Also Read: రివర్స్ గేర్లో దూసుకుపోతున్న వైసీపీ.. అయోమయంలో జగన్
రాష్ట్రంలో 20 వేల మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా? ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు జైలులో పెట్టారు. ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయి. జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక భావోద్వేగానికి గురయ్యాను. జైలులో ఖైదీల సౌకర్యాలను పరిశీలించాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.