Paris Olympics 2024 Six medals and six near misses,India finishes 71st in medal Tally: 2024 పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. అయితే మనవాళ్లు అద్భుతంగా ఆడారు. మొత్తమ్మీద ఆరు పతకాలు సాధించారు. కానీ కొందరు మాత్రం చివరి వరకు పోరాడి తృటిలో పతకాలు కోల్పోయారు. వినేశ్ ఫోగాట్ విషయమైతే చెప్పాల్సిన పనే లేదు. చేతికొచ్చిన పతకం నోటికి అందకుండా పోయింది. దగ్గరలోకి వచ్చి పతకాలు కోల్పోయిన వారి వివరాలు ఒకసారి పరిశీలించండి.
1. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో అర్జును బబుతా నాలుగో స్థానం
2. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ నాలుగో స్థానం
3. స్కిట్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్ జిత్ ఒక్క పాయింట్ తో కాంస్య పతకం పోగొట్టుకున్నారు.
4. వెయిట్ లిఫ్టింగ్ లో మీరా బాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది.
5. ఆర్చరీలో మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో బొమ్మదేవర ధీరజ్, అంకిత్ కూడా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.
6. స్టార్ షట్లర్ లక్ష్య సేన్ కూడా కాంస్య పతకం మిస్ అయ్యింది.
కాకపోతే పురుషుల విభగంలో సెమీస్ చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డ్ స్రష్టించాడు.
Also Read: డ్రీమ్స్లో సిరాజ్ తొలి అడుగు, ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు, జాబితా ఇంకా..
ఇకపోతే పతకాలు సాధించిన భారత అథ్లెట్లు వీళ్లే…
1. మను భాకర్ – కాంస్యం (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్)
2. మను భాకర్ – సర్బ్జ్యోత్ సింగ్ – కాంస్యం (మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్)
3. స్వప్నిల్ కుసలే – కాంస్యం (పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్)
4. హాకీ జట్టు – కాంస్యం (పురుషుల ఫీల్డ్ హాకీ జట్టు), ఆగస్టు 8
5. నీరజ్ చోప్రా – రజతం (పురుషుల జావెలిన్ త్రో)
6. అమన్ సెహ్రావత్ – కాంస్యం (పురుషుల 57 కేజీల రెజ్లింగ్)
లాస్ యాంజిల్స్ లో జరగనున్న 2028 ఒలింపిక్స్ నాటికి ఇప్పుడు ఆడిన భారత క్రీడాకారులు ఎంతమంది ఉంటారో తెలీదు. ఒకవేళ ఆడితే మాత్రం ఇంకా మెరుగైన అవకాశాలైతే ఉంటాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.