CM Revanthreddy: విదేశీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి బిజిబిజీగా ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడు లు రప్పించడమే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగుతోంది. అమెరికా టూర్ ముగించుకున్న నేరుగా దక్షిణకొరియాకు వెళ్లారు.
దక్షిణకొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. సోమవారం ఉదయం ఎల్జీ గ్రూప్ అనుబంధమైన సంస్థ ఎల్ఎస్ ఛైర్మన్ కూ జా యున్తో భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధిని వర్ణిస్తూ నే, త్వరలో కొత్త సిటీని నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ సిటీ.. రకరకాల పరిశ్రమలకు కేరాఫ్గా మారుతుందని వివరించారు.
తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్ – ఎనర్జీ, బ్యాటరీల తయారీ తదితర అంశాలపై ఆ కంపెనీ ప్రతినిధు లతో చర్చించారు సీఎం రేవంత్రెడ్డి. సానుకూలంగా స్పందించిన ఆ కంపెనీ, త్వరలో ఎల్ఎస్ బృందం తెలంగాణలో పర్యటన వస్తామని తెలిపింది ఆ కంపెనీ.
ALSO READ:ముగిసిన అమెరికా టూర్, శాన్ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ రహిత కారులో సీఎం రేవంత్ ట్రావెల్
ఇదిలావుండగా దక్షిణకొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ నిర్వహించిన బిజినెస్మేన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్రెడ్డి. దాదాపు 25 టెక్స్టైల్స్ కంపెనీలకు చెందిన ప్రతి నిధులతో భేటీ అయ్యారు. వరంగల్తోపాటు మిగతా ప్రాంతాల్లో కొరియా నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
అలాగే వరంగల్లో మెగా టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని వివ రించారు. త్వరలో ఎయిర్పోర్టు కూడా మొదలవుతుందన్నారు. కొరియా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందు కు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని వివరించారు.