Olympics closing ceremony: 17 రోజులపాటు క్రీడా అభిమానులను అలకరించిన పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. దాదాపు 205 దేశాలకు చెందిన 10 వేల మంది ఆటగాళ్లు హాజరయ్యారు.
ఈ గేమ్స్లో 40 బంగారు పతకాలు సహా మొత్తం 126 పతకాలతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అమెరికా. దాని తర్వాత ప్లేస్ 91 పతకాలతో చైనా దక్కించుకుంది. ఇక భారత్ ఈసారి 71వ స్థానానికి పరిమితమైంది. గతంలో భారత్ 48వ స్థానం సాధించిన విషయం తెల్సిందే.
పారిస్ ఒలింపిక్స్ ఆరంభం వేడుకలు సెన్ నది వేదికగా జరగ్గా, ముగింపు మాత్రం స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం లో ముగిశాయి. దాదాపు 10 వేల కళాకారులు డ్యాన్స్, సంగీతం ఇలా రకరకాల విభాగాల్లో తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు.
ఫ్రాన్స్ స్మిమ్మర్ లియోన్ మర్చండ్ క్రీడా జ్యోతిని వేదిక వద్దకు తీసుకురాగా, ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యు యెల్ మాక్రాన్, ఐఓసీ ఛైర్మన్ థామస్ బాక్ వేదికపై వచ్చారు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్ బేరర్లు తమ జాతీయ పతకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు.
భారత్ తరపున షూటర్ మనుబాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ పతకధారులుగా వ్యవహరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు.
నిర్వాహకులు ఒలింపిక్స్ ఫ్లాగ్ను లాస్ ఏంజెల్స్ స్పోర్ట్స్ ఛైర్పర్సన్ కేసీ వాసర్మన్కు అందజేశారు. 2028లో లాస్ ఏంజెల్స్లో పోటీలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్లో చైనా స్మిమ్మర్ జాన్ యు ఫై అత్యధికంగా ఆరు పతకాలు గెలిచిన అథ్లెట్గా నిలిచింది. ఆమె ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ ఈసారి ఇండియాకు కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆరడజను పతకాలు చేజారాయి. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచినా పతకాలు సాధించడంలో మన రాత మారలేదనే చెప్పాలి. సౌకర్యాల మాట పక్కనబెడితే, ఆటగాళ్లు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందనేది కొందరి అభిప్రాయం.
Acabaram as #OlimpiadasParis2024
mas vc nao precisa passar vergonha vem pra melhor B.E.T link abaixohttps://t.co/khsodgAETQ#Paris2024 #losangeles2026 #ParisOlympics2024 pic.twitter.com/GRa59Kt1TY— FALHAESPORTIVA (@falhaesportiva) August 12, 2024