EPAPER

KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్

KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్

KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడొద్దంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు తాము చాలా కష్టపడ్డామన్నారు. రూ. 9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదన్నారు. కార్నింగ్ ప్లాంట్, అమరరాజా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తదని తాను ఆశిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలంటూ ఆయన అన్నారు.


Also Read: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

ఇదిలా ఉంటే.. యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాన్ ఒజ్కికి మృతివార్త చాలా బాధ కలిగించిందన్నారు. అత్యంత డైనమిక్ గా ఉండే ఒజ్కికి ఎంతో తెలివైనవారన్నారు. ఆమెతో పలు సందర్భాల్లో మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఒజ్కికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×