Indian Railways: ప్రస్తుత కాలంలో ట్రైన్ జర్నీ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు అందుబాటులో టికెట్ ధరలు ఉండటంతో ప్రతి ఒక్కరూ ట్రైన్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ట్రైన్లు మాత్రం తక్కువగా ఉండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 13 నుంచి 16 వరకు నరసాపురం to నాగర్సోల్, నరసాపురం to సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు తెలిపారు. అందులో
07698
07698 నెంబర్ గల ప్రత్యేక రైలు ఈ నెల 13వ తేదీన ఉదయం 9.50 గంటలకు నరసాపురంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, విజయవాడ, గుంటూరు మీదుగా నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుంది.
07699
07699 నెంబర్ గల ట్రైన్ నాగర్సోల్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
Also Read: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 32 స్పెషల్ ట్రైన్స్..
07517
07517 నెంబరు గల స్పెషల్ ట్రైన్ ఈ నెల 15వ తేదీ రాత్రి 8 గంటలకు నరసాపురంలో బయలుదేరి.. పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది.
07518
07518 ట్రైన్ సికింద్రాబాద్ నుంచి 16న సాయంత్రం బయలు దేరి ఆ మరుసరి రోజు నరసాపురం చేరుకుంటుంది.
07187
పైన పేర్కొన్న స్పెషల్ ట్రైన్లతో పాటు కాకినాడ టౌన్ to సికింద్రాబాద్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను వేశారు. 07187 నెంబరు గల ట్రైన్ ఈ నెల 13, 15 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
07188
07188 నెంబరు గల రైలు సికింద్రాబాద్లో 14, 16 తేదీల్లో సాయంత్రం 6.20కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
Also Read: సొంతూళ్లకు వెళ్లేవారికి శుభవార్త.. 4 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు..!
07653
వీటితో పాటు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా తిరుపతి – కాచిగూడ మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అందులో 07653 నెంబరు గల స్పెషన్ ట్రైన్ను కాచిగూడ నుంచి తిరుపతికి ఈనెల 14, 16న రాత్రి 22.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
07654
07654 నెంబరు గల ట్రైన్ తిరుపతి నుంచి కాచిగూడకు ఈ నెల 15, 17వ తేదీల్లో రాత్రి 19.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 09.30 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకుంటుంది.