EPAPER

Jammu Kashmir: అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

Jammu Kashmir: అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

Encounter: జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పౌరులు కూడా గాయపడ్డారు.


కొకెర్నాగ్ ఏరియాలో అహ్మలాన్ గగర్‌మందులో కొందరు ముష్కరులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఏరియా కార్డన్ ఆఫ్ చేయాలని నిర్ణయించుకున్నారు. జమ్ము కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి లొకేషన్‌కు వెళ్లాయి. అక్కడ కార్డన్ సెర్చ్ చేస్తుండగా కొందరు ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టారు. ప్రాణ రక్షణ కోసం భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి.

Also Read: Chandrababu: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల వల్ల ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×